Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీపై పోటీ చేసిన మాజీ సైనికుడుకి ఈసీ నోటీసులు

Webdunia
బుధవారం, 1 మే 2019 (11:15 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి సమాజ్ వాదీ పార్టీ తరుపున బరిలోకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ సింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవానులకు సరైన ఆహరం అందడంలేదని, నాణ్యమైన భోజనం పెట్టడంలేదని బహుదూర్ సింగ్ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలతో అధికారుల ఆగ్రహానికిగురై ఉద్యోగాన్ని కోల్పోయాడు.
 
అనంతరం ఎస్పీలో చేరడంతో ఆయనకు టికెట్ కేటాయించింది. నామినేషన్ సమయంలో తాను సర్వీసు నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొన్నాడు. కానీ తర్వాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. ఈ లోపాలను గుర్తించిన ఈసీ ఆయనకు నోటీసులు ఇచ్చి, మే 1వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవినీతి, దేశద్రోహ ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిస్ అయిన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు.
 
కాగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈయనపై కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ శర్మ పోటీ చేస్తుండగా, ఎస్పీ నుంచి తేజ్ బహుదూర్ సింగ్ పోటీ చేస్తున్నాడు. ఈయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments