Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదో వివరించిన "ఆర్ఆర్ఆర్" నిర్మాత!!

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (09:26 IST)
తన నిర్మాణ సారథ్యంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్" చిత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఒక తెలుగు చిత్రంలోని ఓ పాటకు ఆస్కార్ రావడం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే, ఈ ఆస్కార్ వేడుకల్లో చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మచ్చుకైనా కనిపించలేదు. దీనిపై అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. దర్శకుడు రాజమౌళికి, నిర్మాత దానయ్యకు ఎక్కడో చెడిందని అందుకే నిర్మాతను దర్శకుడు, చిత్ర బృందం సభ్యులు పట్టించుకోలేదనే ప్రచారం కూడా జరిగింది. 
 
పైగా, "నాటు నాటు" పాటకు ఆస్కార్ అవార్డు రావడం కోసం రాజమౌళి అండ్ కో ఏకంగా రూ.80 కోట్ల మేరకు ఖర్చు చేసి భారీగా లాబీయింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఆస్కార్‌కు వెళ్లకపోవడానికి కారణాలను నిర్మాత దానయ్య తాజాగా వెల్లడించారు. తన గురించి వచ్చిన అన్ని రకాల కథనాలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో రవ్వంత నిజం కూడా లేదని చెప్పారు. 
 
తాను తెరముందు కనిపించకపోయినా, వినిపిస్తే చాలు అని అనుకునే వ్యక్తినని స్పష్టం చేశారు. పబ్లిసిటీ అంటే తనకు నచ్చదని అందుకే ఆస్కార్‌కు వెళ్లలేదని చెప్పారు. ఇకపోతే, "ఆర్ఆర్ఆర్" చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలపై కూడా దానయ్య క్లారిటీ ఇచ్చారు. "ఆర్ఆర్ఆర్" చిత్ర నిర్మాణంలో ఏ ఒక్క హీరో భాగస్వామ్యం లేదని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments