Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు విచారణలో రకుల్ చెప్పింది ఇదే, శిక్ష పడుతుందా?!

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:15 IST)
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో డ్రగ్స్ కేసు బయటపడటం... కొంతమంది సినీ తాలర పేర్లు తెర పైకి రావడం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ షాక్ అయ్యింది. విచారణకు హాజరైన రకుల్ ఏం చెప్పింది అనేది ఆసక్తిగా మారింది. 
 
దాదాపు 3 గంటల పాటు జరిగిన విచారణలో రకుల్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇండియా టుడే ఛానల్ రకుల్ చెప్పింది ఇదే అంటూ ఆసక్తికరమైన కథానాన్ని ప్రసారం చేసింది. 
 
ఇంతకీ ఏమని ప్రసారం చేసిందంటే... ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. రియా కోరిక మేరకు డ్రగ్స్ తన ఇంట్లో దాచినట్టు ఒప్పుకుంది అని. విచారణ కంటే ముందు ముంబయిలోని రకుల్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించారు.
 
ఈ సోదాల్లో మాదకద్రవ్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే, ఆ డ్రగ్స్ తనవి కావని, రియా కోరిన మీదట తన ఫ్లాట్లో ఉంచినట్టు రకుల్ అంగీకరించిందని సమాచారం. తనకు ఏ ఒక్క డ్రగ్ డీలరు తెలియదని చెప్పింది. డ్రగ్స్ సేవించకపోయినా... ఇంట్లో డ్రగ్స్ దాచడం కూడా చట్టరీత్యా నేరం. 
 
ఈ విషయం తెలిసినప్పటి నుంచి రకుల్ ఈ కేసు నుంచి బయటపడుతుందా..? లేదా... ఒకవేళ శిక్షపడితే.. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments