Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఎస్పీబీ శకం : వ్యవసాయక్షేత్రంలో సేదతీరిన గానగంధర్వుడు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:42 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నై సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య శనివారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయనకు ఇష్టంగా నిర్మించుకున్న వ్యవసాయక్షేత్రంలో ఈ అంత్యక్రియలు ముగిశాయి. ఎస్బీబీ పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
 
చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఆయనను కడసారి చూసుకున్నారు. సినీ ప్రముఖులు భారతీరాజాతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌, శివబాలాజీ, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.
 
అలాగే, తమిళ హీరో విజయ్ కూడా చివరి క్షణంలో అక్కడకు వచ్చారు. బాలు భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. ఆయన పార్థివదేహానికి నమస్కరించి అంజలి ఘటించారు. పక్కనే ఉన్న బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ని సముదాయించారు. మరోవైపు ఫాంహౌస్ వద్దకు అభిమానులు పోటెత్తుతున్నప్పటికీ... కరోనా నేపథ్యంలో ఫాంహౌస్‌లోకి అందరినీ పోలీసులు అనుమతించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో మూడు రోజుల వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments