Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌కు డాక్టర్ రామినేని ప్రత్యేక పురస్కారం..

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (13:19 IST)
కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో పేదలను, ముఖ్యంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ఎంతో సాయం చేసి, తాను రియల్ లైఫ్‌లో హీరోనని అనిపించుకున్న ప్రముఖ ప్రతి నాయకుడు సోనూసూద్ సేవలకు గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ రామినేని ఫౌండేషన్, ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. 
 
డిసెంబర్ లేదా జనవరిలో ఈ పురస్కారాన్ని సోనూసూద్‌కు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ వెల్లడించారు. ఈ సంవత్సరం పురస్కారాలను పొందిన వారి పేర్లను ఆయన ప్రకటించారు. 
 
నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులును విశిష్ట పురస్కారానికి ఎంపిక చేశామని ధర్మ ప్రచారక్ తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ వేమూరి సుధాకర్‌, ద్వారకామయి ట్రస్ట్‌ ద్వారా సేవలందిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్, యాంకర్ కనకాల సుమలను కూడా సత్కరిస్తామని తెలిపారు. 
 
ప్రత్యేక, విశిష్ట పురస్కార విజేతలకు రూ. 2 లక్షల నగదు బహుమతిని, విశేష పురస్కార గ్రహీతలకు రూ.1 లక్షను అందించనున్నామని ఆయన అన్నారు. కాగా, తనకు లభించే నగదు బహుమతిని, హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి అందించాలని సోనూసూద్ ఇప్పటికే రామినేని ఫౌండేషన్‌కు సూచించి, తనలోని పెద్ద మనసును మరోసారి చాటుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments