Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌కు డాక్టర్ రామినేని ప్రత్యేక పురస్కారం..

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (13:19 IST)
కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో పేదలను, ముఖ్యంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ఎంతో సాయం చేసి, తాను రియల్ లైఫ్‌లో హీరోనని అనిపించుకున్న ప్రముఖ ప్రతి నాయకుడు సోనూసూద్ సేవలకు గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ రామినేని ఫౌండేషన్, ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. 
 
డిసెంబర్ లేదా జనవరిలో ఈ పురస్కారాన్ని సోనూసూద్‌కు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ వెల్లడించారు. ఈ సంవత్సరం పురస్కారాలను పొందిన వారి పేర్లను ఆయన ప్రకటించారు. 
 
నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులును విశిష్ట పురస్కారానికి ఎంపిక చేశామని ధర్మ ప్రచారక్ తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ ఆఫీషియల్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ వేమూరి సుధాకర్‌, ద్వారకామయి ట్రస్ట్‌ ద్వారా సేవలందిస్తున్న బండ్లమూడి శ్రీనివాస్, యాంకర్ కనకాల సుమలను కూడా సత్కరిస్తామని తెలిపారు. 
 
ప్రత్యేక, విశిష్ట పురస్కార విజేతలకు రూ. 2 లక్షల నగదు బహుమతిని, విశేష పురస్కార గ్రహీతలకు రూ.1 లక్షను అందించనున్నామని ఆయన అన్నారు. కాగా, తనకు లభించే నగదు బహుమతిని, హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి అందించాలని సోనూసూద్ ఇప్పటికే రామినేని ఫౌండేషన్‌కు సూచించి, తనలోని పెద్ద మనసును మరోసారి చాటుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments