Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా పటానీపై మనసుపడిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (11:31 IST)
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ భామ దిశా పటానీపై మనసుపడ్డారు. తాను నటించే తొలి బాలీవుడ్ ప్రాజెక్టులో ఆమెను ఎంపిక చేయాల్సిందిగా సిఫార్సు చేసినట్టు సమాచారం. 
 
నిజానికి ఇటీవలి కాలంలో పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. ఆ కోవలోనే ప్రభాస్‌ కథానాయకుడిగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఛత్రపతి". ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.
 
ఈ సినిమాలో కథానాయికగా దిశాపటానీ దాదాపుగా ఖాయమైనట్టే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. జాన్వీ కపూర్‌తోపాటు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆ అవకాశం దిశా పటానీ సొంతమైనట్టు సమాచారం. 
 
దిశా హిందీతోపాటు, తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. పూరి దర్శకత్వం వహించిన ‘లోఫర్‌’ సినిమాతో ఆమె తెలుగులో సందడి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments