Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో ఏకాంతంగా లాడ్జిలో, భర్తకు తెలిసి గదికి వెళ్ళేలోపు..?

ప్రియుడితో ఏకాంతంగా లాడ్జిలో, భర్తకు తెలిసి గదికి వెళ్ళేలోపు..?
, మంగళవారం, 2 మార్చి 2021 (17:12 IST)
పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ప్రియుడిని మర్చిపోలేకపోయేంది. పెళ్ళయి సుమారుగా ఏడేళ్ళవుతోంది. అంతకు ముందే ప్రియుడితో ఉన్న సాన్నిహిత్యం ఆమెను మర్చిపోలేకుండా చేసింది. ప్రియుడితో పడక సుఖం బాగా నచ్చింది. అందుకే పెళ్ళయినా భర్తకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రియుడితో గడిపింది. అక్రమ సంబంధం ఎన్నో రోజులు దాగదు కదా భర్తకు తెలిసింది.
 
ఏలూరు తంగెళ్ళమూడికి చెందిన కుసుమ నాగసాయికి నాగరాజుకుకి 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ఏలూరు గన్ బజార్‌లో నివాసముంటున్నారు. నాగరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం.
 
అయితే నాగసాయికి పెళ్ళికి ముందే షేక్ నాగూర్ అనే వ్యక్తితో సంబంధం ఉండేది. పెళ్ళి తరువాత కూడా అలాగే కొనసాగించింది నాగసాయి. ప్లాట్ల బిజినెస్ చేసేందుకు భర్త బయటకు వెళ్ళినప్పుడు అతనికి అనుమానం రాకుండా బయటకు వెళ్ళి ప్రియుడితో లాడ్జిలో ఎంజాయ్ చేసేది నాగసాయి.
 
ఇలా సంవత్సరం పాటు సాగింది. అయితే ఆదివారం కూడా ఇలాగే చేసింది. పిల్లలను ఇంట్లో వదిలి వస్తానని చెప్పి లాడ్జిలో ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. విషయం కాస్త భర్తకు తెలిసింది. నేరుగా లాడ్జి దగ్గరకు బయలుదేరాడు. తల్లికి ఇంట్లో నుంచి ఫోన్. అమ్మా.. నాన్న కోపంగా ఉన్నాడని పిల్లలు ఫోన్ చేశారు.
 
ఇంకేముంది నాగసాయికి అర్థమైపోయింది. తన విషయం భర్తకు తెలిసిపోయిందన్న భయంతో నిద్రమాత్రలు తెచ్చుకుని ఇద్దరూ కలిసి మింగేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హథ్రాస్‌లో మరో దారుణం.. అత్యాచార నిందితుడు అంత పనిచేశాడా?