భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమాతో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్గా చరణ్ రొరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం `రొరి`. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో లెజెండ్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నిర్మాత హీరో చరణ్ రోరి పుట్టినరోజు సందర్బంగా చిత్రం మొదటి లుక్ను క్రేజి దర్శకుడు మారుతి విడుదల చేశారు.
ఈ సందర్బంగా చరణ్ రోరి మాట్లాడుతూ, ఈ చిత్ర కథ హైదరాబాద్ పోలిటికల్ బ్యాక్ డ్రాప్లో జరిగే కుర్రాడి కధ, అనుకోని పరిస్థితుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్కు వెళ్ళాల్సివచ్చింది, అక్కడ కొంతమంది హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది ఈ చిత్ర కథ, ఈ చిత్ర కథనం ఆద్యంతం ఉత్కంఠ భరితం గా వుంటుంది. త్వరలో టీజర్ని ట్రైలర్ని విడుదల చేస్తామని అన్నారు.