Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:47 IST)
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలతో పాటు సాధారణ పౌరులు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు కరోనా వైరస్ బారిపడ్డారు. సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైరస్ సోకింది. ఈ క్రమంలో తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
సెప్టెంబరు 30వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments