'మాస్ మహారాజ్' రవితేజ హీరోయిన్‌ డింపుల్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (12:19 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో 'మాస్ మహారాజ్' రవితేజ సరసన నటించిన హీరోయిన్ డింపుల్ హయాతి. ఈమెకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. పూర్తిగా టీకాలు వేసుకున్నప్పటికీ తనకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె ట్వీట్‌లో వెల్లడించారు. 
 
ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఈ మధ్యకాలంలో తనతో కాంటాక్ట్ అయిన వారు విధిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇకపోతే, తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని కోరారు.
 
కాగా, రవితేజతో కలిసి ఆమె "ఖిలాడీ" చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. అలాగే, తమిళ హీరో విశాల్ నటించిన కొత్త చిత్రం "సామాన్యుడు"లోనూ డింపుల్ హయాతి నటించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ గత వారం చెన్నైలో జరిగింది. ఇందులో డింపుల్ హయాతి కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఆమెకు కరోనా వైరస్ సోకివుండొచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments