Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌కు చెందిన ఆ నలుగురు హీరోలపై నిషేధం!

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:51 IST)
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన నలుగురు హీరోలపై తమిళ చిత్ర నిర్మాతల మండలి నిషేధం విధించింది. కాల్షీట్లు ఇచ్చిన సినిమా షూటింగులకు రాకుండా డుమ్మా కొడుతున్న హీరోలు శింబు, ధనుష్, విశాల్, అధర్వలపై తమిళ సినీ నిర్మాతల మండలి నిషేధం విధించింది. కోలీవుడ్ నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం బుధవారం చెన్నైలో జరిగింది. 
 
ఇందులో అనేక అంశాలపై చర్చించిన నిర్వాహకులు.. కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులోభాగంగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి నిర్మాణంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం పట్టాలెక్కింది. అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్‌ రాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. అందువల్ల ధనుష్‌పై నిషేధం విధించారు. 
 
మరోవైపు గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విశాల్‌ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, శింబు, అధ్వర్యలకు కూడా రెడ్ కార్డు వేశారు. అయితే దీనికి సంబంధించి నిర్మాతల మండలి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలోనే తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments