Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌కు చెందిన ఆ నలుగురు హీరోలపై నిషేధం!

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:51 IST)
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన నలుగురు హీరోలపై తమిళ చిత్ర నిర్మాతల మండలి నిషేధం విధించింది. కాల్షీట్లు ఇచ్చిన సినిమా షూటింగులకు రాకుండా డుమ్మా కొడుతున్న హీరోలు శింబు, ధనుష్, విశాల్, అధర్వలపై తమిళ సినీ నిర్మాతల మండలి నిషేధం విధించింది. కోలీవుడ్ నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం బుధవారం చెన్నైలో జరిగింది. 
 
ఇందులో అనేక అంశాలపై చర్చించిన నిర్వాహకులు.. కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులోభాగంగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి నిర్మాణంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం పట్టాలెక్కింది. అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్‌ రాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. అందువల్ల ధనుష్‌పై నిషేధం విధించారు. 
 
మరోవైపు గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విశాల్‌ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, శింబు, అధ్వర్యలకు కూడా రెడ్ కార్డు వేశారు. అయితే దీనికి సంబంధించి నిర్మాతల మండలి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలోనే తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments