Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:45 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వంటి హీరోలకు ల్యాండ్ మార్క్‌ సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందాడు. ఇపుడు మహేష్ బాబు చిత్రానికి కూడా డీఎస్పీ సంగీతం సమకూర్చిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
టాలీవుడ్‌లో ఉన్న సంగీత దర్శకుల్లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. డీఎస్పీ సంగీతం అంటే మ్యూజికల్‌గా హిట్ కొట్టినట్టే. ప్రస్తుతం దేవిశ్రీ మహేష్ బాబు 25వ సినిమాకు సంగీత బాణీలు సమకూర్చాడు. మహర్షిలో సాంగ్స్ పెద్దగా లేవు అనుకున్న వాళ్లకు మహర్షి థీమ్ సాంగ్‌తో సమాధానం చెప్పాడు. "మహర్షి"కి సంగీతం అందిస్తున్న దేవీశ్రీ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. 
 
అదేమంటే.. సౌత్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్‌గా చెప్పుకునే సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో', కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 25వ సినిమా 'సింగం' అలానే మెగాస్టార్ 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ 25వ సినిమా 'మహర్షి'కి కూడా దేవిశ్రీ సంగీతం అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments