Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్... అల్లుడు - మనువడితో కలిసి దీపావళి

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన ఆయన.. తన అభిమానులను దీపావళి పండగరోజున కలుసుకోవాలన్న ఉద్దేశంతో సడన్‌గా స్వదేశానికి తిరిగివచ్చేశారు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (13:21 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన ఆయన.. తన అభిమానులను దీపావళి పండగరోజున కలుసుకోవాలన్న ఉద్దేశంతో సడన్‌గా స్వదేశానికి తిరిగివచ్చేశారు. 
 
ఆదివారం ఉదయం రజినీకాంత్‌ను పోయస్ గార్డెన్‌లోని ఆయన ఇంట్లో చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రజినీ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఆయన్ను దీపావళి సందర్భంగా శాలువాలతో సన్మానించి ఆనందించారు. 
 
ఈ సందర్భంగా తాజా చిత్రం, రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన 'కబాలీ' 100 రోజుల సెలబ్రేషన్స్‌ను సైతం అభిమానులు సందడిగా జరుపుకున్నారు. వచ్చే సంవత్సరం రోబో సీక్వెల్ '2.0' విజయంతో దీపావళిని జరుపుకుంటామని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.
 
అంతకుముందు రజినీకాంత్ దీపావళి పండుగను తన అల్లుడు, తమిళ హీరో ధనుష్, మనువడు, కుమార్తె ఐశ్వర్య, సౌందర్యలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments