Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీపై బయోపిక్ ఉండదు : దగ్గుబాటి సురేశ్ బాబు

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయనున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన తనయుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు. తన తండ్రి రా

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (10:37 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయనున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన తనయుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు. తన తండ్రి రామానాయుడిపై బయోపిక్ తెరకెక్కించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.
 
ఆయన నిర్మాణ సారథ్యంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
తన తండ్రి రామానాయుడి బయోపిక్‌ను తెరకెక్కించాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమన్నారు. 'మహానటి', 'సంజు' వంటి బయోపిక్స్‌కు దీనికి మధ్య చాలా తేడా ఉందన్నారు. వాళ్లు తమ జీవితాలలో పలు కోణాలను చవిచూశారన్నారు. తన తండ్రి జీవితం అలా కాదని, కథలో కాంట్రవర్సీ లేకపోతే ఎవరూ వినరు, చూడరని వివరించారు. ఇప్పటికైతే ఆయన బయోపిక్ తెరకెక్కించాలన్న ఆలోచన లేదన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments