Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి నుంచి బయటపడిన మెగా బ్రదర్

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (16:59 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అనేక మంది సెలెబ్రిటీలకు సోకుతోంది. వారిలో ఎక్కువ మంది ఈ వైరస్ నుంచి కోలుకుంటున్నారు. కానీ, ఎస్పీబీ వంటి గానగంధర్వుడు ఈ వైరస్ బారినపడి కోలుకున్నప్పటికీ.. ఆ వైరస్ శరీర అంతర్గత భాగాల్లో చేసిన డ్యామేజీ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఇపుడు ఈ వైరస్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా కోలుకున్నారు. 
 
ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇటీవ‌ల మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబును ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు నాగ‌బాబు. అయితే ప్ర‌స్తుతం తాను క‌రోనాను జ‌యించిన‌ట్టు తెలిపిన నాగ‌బాబు .. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలు, కోలుకున్న విధానాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు తాను ఐదు సార్లు క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు తెలిపిన నాగ‌బాబు.. నిహారిక నిశ్చితార్ధానికి ముందు కూడా క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు పేర్కొన్నాడు. అయితే ఇటీవ‌ల కాస్త చ‌లి జ్వ‌రంతో పాటు మ‌త్తుగా అనిపించ‌డంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని అన్నారు. క‌రోనా పాజిటివ్ అంటే ముందు చాలా ఆందోళ‌న‌కు గుర‌య్యాను.
 
గతంలో న్యూమోనియా ఉండడంతో ఆస్పత్రిలో చేరాను. ఐదురోజులు రెమిడెసివిర్ ఔషధాన్ని ఇచ్చారు. జ్వరం ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలుగలేదని నాగబాబు తెలిపారు. కరోనాకు ఎవరు అతీతులు కారని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వస్తుందని నాగబాబు తెలిపారు. 
 
జ్వరం దగ్గు జలుబు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండని నాగబాబు తెలిపారు. కరోనాకు మందు లేదని.. వైరస్ లోడును బట్టి చికిత్స అందిస్తారని.. కరోనా వైరస్ 14 రోజుల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందన్నారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్నా మనకు హాని కలిగించదని అన్నారు. తాను ఫ్లాస్మా దానం చేస్తానని నాగబాబు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments