Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేదంతో కరోనాని జయించవచ్చు: అల్లు శిరీష్

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (16:05 IST)
ఆ మధ్య కాస్త తగ్గినట్లు కనిపించినా కరోనా వైరస్ ఈ మధ్య మళ్ళీ పెరుగుతుంది. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో ఇప్పుడు అల్లు శిరీష్ కూడా టెస్ట్ చేయించుకున్నారు. ఇదే విషయంపై ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దాంతో పాటు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన సూచించారు.
 
"నేను రెండుసార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నాను.. రిజల్ట్ నెగిటివ్ వచ్చింది.. మన ఆరోగ్యం కోసం నేను ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నేను పెళ్ళికి వెళ్ళాను.. బయట తిరిగాను.. 100 మందితో కలిసి షూటింగ్ చేశా.. కానీ వాటి కంటే ముందు కరోనాకు జాగ్రత్తలు పాటించాలి. నేను తప్పకుండా మాస్కు పెట్టుకున్నాను.. శానిటైజర్ క్రమంతప్పకుండా వాడాను.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు రాకుండా ఉండటం అనేది అసాధ్యం. మనకు మనమే జాగ్రత్తలు పాటించాలి.
 
నా విషయంలో కొంత అదృష్టం మరికొంత ఆయుర్వేదం నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అనుకుంటున్నాను. మనం ఈ ప్రపంచంలో ఇతర జీవరాశులతో కలిసి ఎన్నో వందల సంవత్సరాలుగా జీవిస్తున్నాం. ఆ జీవరాశుల నుంచి వచ్చే సమస్యలతో మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ విషయం గురించి ఎన్నో ఏళ్ళ కింద మన పురాణాల్లోనే పరిష్కారం చూపించారు.
 
వ్యాక్సిన్ వచ్చేవరకు మాస్కులు, శానిటైజర్లతో పాటు మన సాంప్రదాయ పద్ధతులను కూడా ఫాలో అవ్వండి. ఆయుష్ క్వాతా, మృత్యుంజయ, చ్యవన్‌ప్రాస ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సనాతన ధర్మాలు, ఆయుర్వేదం మన తాతముత్తాతలు మన ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద బహుమతులు. వీటిని పాటించి అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం.." అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments