మంత్రి పదవుల్లోనే కాదు.. న్యాయ విభాగంలోనూ... సీఎం జగన్‌కు ఏమైంది?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:10 IST)
ఇటీవల మంత్రిపదవుల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి.. ఇపుడు న్యాయ విభాగంలోనూ సామాజిక  సూత్రం పాటిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్‌.జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు. 
 
ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ నియమించిన 17 మంది జీపీల్లో కూడా ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ సామాజిక సూత్రాన్ని పాటించారు. 
 
ఇద్దరు ఎస్సీలను, ఒక ఎస్టీని, ఒక ముస్లింని, నలుగురు బీసీలను ప్రభుత్వ ప్లీడర్లగా నియమించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 4, కాపులకు 2, బ్రాహ్మణులకు 2 చొప్పున జీపీలుగా నియమితులయ్యారు. మిగిలి ఉన్న 5 పోస్టుల భర్తీలో సీఎం నిర్దేశించిన సామాజిక సూత్రాన్ని పాటిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్ వెల్లడించారు. స్టాండింగ్‌ కౌన్సిల్, ఏజీపీల నియామకాల్లోనూ ఇదే పద్దతిని పాటిస్తామన్నారు. 50 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments