Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాట్యం' చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న క్లాసికల్ డ్యాన్సర్ సంధ్య రాజు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (14:25 IST)
రామ్‌కో గ్రూప్ ఛైర్మెన్ పిఆర్ వెంకట్రామ రాజు కుమార్తెగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్‌గా కూడా అందరికీ సుపరిచితమైన సంధ్య రాజు, తెలుగు చలనచిత్ర రంగం ద్వారా సినీ రంగానికి పరిచయం కాబోతున్నారు. 
 
క్లాసికల్ డ్యాన్సర్‌ నుండి యాక్టర్‌గా మారుతున్న ఈమె, దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టిన రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ‘నాట్యం’ అనే డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌ ఫీచర్ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు.
ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు నిర్మాణ బాధ్యతలు వహించారు. రాబోయే కొన్ని వారాలలో థియేటర్‌లలో విడుదలకు సిద్ధం కానున్న, ఈ ‘నాట్యం’ చిత్రానికి ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించనున్నారు.
 
ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్, ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి సంబంధించిన యూట్యూబ్ టీజర్‌ని టాలీవుడ్ సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే విడుదల చేయగా, అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ఉపాసన కామినేని కొణిదెల సినిమాకు సంబంధించిన ‘పోస్టర్‌’ని విడుదల చేసారు. అతి త్వరలో ఈ సినిమా తమిళంలో కూడా విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments