"పుష్ప" బృందానికి చిరు విషెస్- సినిమా కోసం చెమట చిందించారంటూ ట్వీట్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (09:57 IST)
అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తయారు చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. 
 
ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతుండగా, మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఈ చిత్రం కోసం మీరు మీ చెమటను చిందించారు. ఎంతో నిబద్ధతతో పని చేశారు. మీరు సినిమా కోసం చేసిన ప్రయత్నాలు అన్ని అభినందనీయం" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ ఐదు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదేసమయంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రం కోసం యూనిట్ సభ్యులు పడిన కష్టాలను నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకుడు ఏకరవుపెట్టిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments