ఫేడౌట్ హీరోయిన్ వద్దబాబాయ్ అంటున్న మెగా ఫ్యాన్స్...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం షూటింగ్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ అంటే ప్రారంభంకానుంది. అంటే ఈ యేడాది డిసెంబర్ నెలాఖరులో సెట్స్‌పైక

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:35 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం షూటింగ్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ అంటే ప్రారంభంకానుంది. అంటే ఈ యేడాది డిసెంబర్ నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, నిత్యా మీనన్‌ల ఖరారు చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
 
ఇటీవలి కాలంలో తమన్నా ఐరెన్ లెగ్‌గా ముద్ర పడిపోయింది. ఈమె చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. దానికితోడు తమన్నా ఫేడ్ఔట్ అవుతోంది. ఈ సమయంలో ఆమెను చిరు 152వ చిత్రంలో ఎంపిక చేయడాన్ని చిరు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
అయితే, కొరటాల మాత్రం తమన్నా గ్లామర్‌పరంగా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దానికితోడు చిరంజీవికి సరి జోడీగా డాన్స్ వేసి అలరిస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక నిత్యామీనన్‌ను నటన పరంగా ఎంపిక చేయడం జరిగింది. చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్ నటించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హీరోయిన్స్ విషయంలో దర్శకుడు కొరటాల పునరాలోచించాల్సిందిగా మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. 
 
ఇకపోతే, చిరంజీవి ప్రస్తుతం 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సైరా చిత్రం విడుదలకు ముందే చిరు 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభంకానుంది. చిరంజీవి కోసం కొరటాల శివ ఒక పవర్‌ఫుల్ స్టోరీని తయారు చేసే పనిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments