Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పటికైనా బాలయ్య ఛాన్సిచ్చేనా?

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ బయోపిక్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు, సినీ హీరో బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:32 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ బయోపిక్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు, సినీ హీరో బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వివిధ రకాల పాత్రలకు అనేక మంది ప్రముఖ సెలెబ్రిటీలను ఎంపిక చేశారు.. చేస్తున్నారు కూడా. మరోవైపు, ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
 
నిజానికి గత కొంతకాలంగా బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న ప్రచారం బాగా ఉంది. ఆ వార్తలు నిజమేనేమో అన్నట్లుగా చాలాకాలంగా వీరిద్దరు కలిసిందే లేదు. దాంతో నందమూరి అభిమానులు ఈ బాబాయి - అబ్బాయిలు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో నందమూరి ఫ్యామిలీలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టాలీవుడ్ హీరోలు తారక్, కళ్యాణ్ రామ్‌ల తండ్రి బాలకృష్ణ అన్నయ్య అయిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో నందమూరి ఫ్యామిలీతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కూడా ఒక్కటయ్యారు. 
 
హరికృష్ణ మరణంతో షాక్‌లో ఉన్న నందమూరి అభిమానులకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్‌లో కొత్త కోరికలు కలుగుతున్నాయి. మొన్నటివరకు బాబాయి - అబ్బాయి కలవాలని కోరుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు అది నెరవేరడంతో మరో కోరిక కోరుకుంటున్నారు. 
 
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య నటిస్తుండగా హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఇదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 
 
ఎలాగూ నందమూరి హీరోలు కలిసి పోయారు కనుక 'ఎన్టీఆర్' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 'ఎన్టీఆర్' సినిమా స్థాయిని పెంచేందుకు బాలయ్య బాబు కాస్త మంచి మనసు చేసుకుని జూనియర్‌కు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు వేడుకుంటున్నారు. మరి అభిమానుల వేడుకోలును బాలయ్య బాబు వింటాడో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments