Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాప్యాన్ని లెక్కచేయ అంజనాదేవి ... మాస్కుల తయారీలో చిరంజీవి తల్లి

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (10:25 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా సమాజసేవలో అంకితమయ్యారు. ఇందులోభాగంగా ఆమె కరోనా మాస్కుల తయారీలో నిమగ్నమయ్యారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజిక భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు ముఖానికి ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. 
 
అదేసమయంలో కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో భాగంగా, ప్రతి ఒక్కరూ తమకుతోచిన విధంగా సాయం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు పీఎం, సీఎంల రిలీఫ్ ఫండ్‌కు నిధులందించగా, రిటైర్డ్ సైనికులు లాక్‌డౌన్ అమలులో పోలీసులకు సాయం చేస్తున్నారు. 
 
విశ్రాంత వైద్యులు, తాము సైతం అంటూ కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా ఎంతో మంది కరోనాపై పోరులో సహకరిస్తున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి తనకు చేతనైనంతలో సాయం చేసి, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 
 
తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన అంజనాదేవి, 700 మాస్క్‌లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారు. తన వయసును, వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా, ఆమె పడిన శ్రమ, సమాజం పట్ల చూపిన బాధ్యతకు పలువురు ఫిదా అవుతూ, అభినందనల వర్షం కురిపించారు.
 
అలాగే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి భార్య కావ్య కూడా ఇదే విధంగా మాస్కుల తయారీలో నిమగ్నమైన విషయం తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉన్న తన భార్య, సమయాన్ని సద్వినియోగం చేస్తోందని, ఇంట్లోనే మాస్క్‌లను తయారు చేస్తున్నదని చెబుతూ, ఆ ఫోటోలను కిషన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కూడా వైరల్ అయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments