Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం: పునాదిరాళ్లు దర్శకుడు.. ఉదయ్ కిరణ్‌ల మృతి

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:14 IST)
chiru First Director
పరారే పరారే.. ఫ్రెండ్స్ బుక్ సహా పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించాడు. అయితే ఉదయ్ కిరణ్ శుక్రవారం రాత్రి కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని రామారావుపేటలోని నివాసం ఉంచారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు'. ఈ సినిమా దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కారణంగా బాధపడుతోన్న ఆయన శనివారం తనువు చాలించారు. రాజ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించారు. రాజ్‌కుమార్‌ స్వస్థలం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు.
 
కాగా.. భౌతికకాయాన్ని ఉయ్యూరు తరలించేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు మరణించారు. ఆ తర్వాత భార్య కూడా మృతి చెందడంతో ఒంటరివాడు అయ్యాడు. అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. రాజ్‌కుమార్‌ తన మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఆ చిత్రానికి ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు పొందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో మూడు రోజుల వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments