Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు అలా జరిగివుంటే ఈ చిరంజీవి మీ ముందువుండేవారు కాదు: మెగాస్టార్

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (12:08 IST)
మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పైగా, ఈ విషయం ఇప్పటివరకు చిరంజీవి కుటుంబ సభ్యులకు మినహా ఇతరులకు తెలియదు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన ఇప్పటివరకు బయటి వ్యక్తులకు తెలియని ఓ విషయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఆయన చెప్పిన విధానం ఏ దర్శకుడికి తీసిపోని విధంగా ఉండడంతో సభికులు కూడా ఎంతో ఆసక్తిగా విని చివర్లో అత్యంత విస్మయానికి లోనయ్యారు. ఇంతకీ ఆయనేం చెప్పారంటే... ఓ కొత్త జంట పల్లెటూరు నుంచి పక్కనే ఉన్న పట్టణానికి సినిమా చూసేందుకు బయల్దేరారంటూ మొదలుపెట్టారు.
 
'ఆ సమయంలో భార్య గర్భవతిదాల్చివుంది. కాన్పుకు సమయం కూడా సమీపించింది. కానీ తన అభిమాన హీరో సినిమా విడుదలైంది. దాంతో ఆ సినిమా చూడాలన్న కోరికను తన భర్తతో చెప్పింది. పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఓ నిండు గర్భవతికి అది చాలా ప్రమాదంతో కూడిన ప్రయాణం. అయినా భార్య కోరిక కాదనలేక ఆ భర్త ఓ జట్కా బండి ఏర్పాటు చేశాడు. అయితే మార్గమధ్యంలో వారు ఎక్కిన గుర్రపుబండి ప్రమాదానికి గురై పక్కకి పడిపోయింది. భార్య కూడా కిందపడిపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
 
వెనక్కివెళ్లిపోదామని ఆ భర్త చెప్పినా భార్య వినిపించుకోకుండా సినిమాకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో అలాగే ముందుకెళ్లి సినిమా చూసి వచ్చారు. ఆనాడు గర్భంతో ఉన్న ఆవిడ ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి. భార్య కోరిక తీర్చిన ఆ వ్యక్తి మా నాన్న వెంకట్రావు. మా అమ్మ చూడాలనుకున్న సినిమా 'రోజులు మారాయి'. కథానాయకుడు ఎవరో కాదు ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారే. ఇంతకీ ఆమె కడుపులో ఉన్నది ఎవరో కాదు నేనే" అంటూ సభికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా కళతాళ ధ్వనులతో అభినందించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments