Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడు కోసం చిరంజీవి.. అతని కోసం బాలయ్య.. ఒకే వేదికపై అగ్ర హీరోలు

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరుగనుంది.

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (14:45 IST)
మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరుగనుంది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి, మరో అగ్రనటుడు బాలకృష్ణలు ఒకే వేదికను పంచుకోనున్నారు.
 
చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తన అల్లుడు కళ్యాణ్‌ను తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు విజేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవీ వస్తున్నారు. అలాగే, బాలకృష్ణ రావడానికి కూడా కారణం ఉంది. ఈ చిత్రం వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటి ... బాలయ్య బాబుకు మంచి స్నేహితుడు. ఈ కారణంగా ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఒకే వేదికపై ఆశీనులు కానున్నారు. 
 
ఇదే క‌నుక నిజ‌మైతే విజేత సినిమాకి కావ‌ల‌సినంత ప్ర‌మోష‌న్ రావ‌డంతో పాటు ఇటు మెగా అభిమానుల‌కి, ఇటు నంద‌మూరి అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోతుంది. 'విజేత' చిత్రంలో మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించగా, సినిమా జూలైలో విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక ఈనెల 24వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments