Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొరటాల-చిరు సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్? హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి1 50వ సినిమా నుంచి చరణ్ సొంత బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా రూపొంద

కొరటాల-చిరు సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్? హీరోయిన్?
, గురువారం, 14 జూన్ 2018 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి1 50వ సినిమా నుంచి చరణ్ సొంత బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న 'సైరా' సినిమాకి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. 
 
ఈ చిత్రం తర్వాత కొరటాల శివతో కలిసి చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు వార్తలొచ్చినా.. ఈ సినిమాలో చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, చరణ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇక కొరటాల దర్శకత్వం వహించే ఈ చిత్రానికి చిరంజీవి రైతుగానూ, బిలియనీర్‌గా ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం కొరటాల కసరత్తులు చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో సినీనటి అపూర్వ ఫోటోలు.. వెల రూ.40వేలు?