Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి ఓకేగానీ... ఆ ఒక్కటి చేస్తే మంచిది : చిరంజీవి

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (15:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ టిక్కెటి విధానం అమలు మంచిదే అయినప్పటికీ... టిక్కెట్ ధరలను తగ్గించడం సముచితం కాదనీ ఈ విషయంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు కారణంగా గతంలో మాదిరిగా ఇష్టంవచ్చినపుడుల్లా టిక్కెట్ల ధరలను పెంచుకోవడం ఇక కుదరదు. ఈ బిల్లుపై చిరంజీవి స్పందించారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం రాష్ట్రంలో ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి వీలు కల్పంచే బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. 
 
అయితే, థియేటర్ల మనుగడతో పాటు.. చిత్రపరిశ్రమను నమ్ముకుని వున్న వేలాది కుటుంబాల బతుకు దెరువు కోసం తగ్గించిన టిక్కెట్ ధరలను కాలానుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా ధరలను సముచిత రీతిలో నిర్ణయిస్తే  పరిశ్రమకు మేలు జరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments