Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" నుంచి మరో లీక్... ఏంటది?

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (20:35 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'ఆచార్య' సెట్స్ నుంచి ఓ ఆసక్తికరమైన ఫొటో బయటికి వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ సైనిక దుస్తుల్లో ఉండగా, వారికి దర్శకుడు కొరటాల శివ సీన్ వివరిస్తుండటం ఆ ఫొటోలో చూడొచ్చు. 
 
ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆచార్య', కొత్త షెడ్యూల్ ఇల్లెందులో షురూ అయింది. ఇక్కడి బొగ్గు గనుల్లో ఫైటింగ్ సీక్వెన్స్‌‌‍లను చిత్రీకరించనున్నారు. దర్శకుడు కొరటాల ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్‌లతో కలిసి ఆదివారం ఉదయమే లొకేషన్‌ను పరిశీలించారు.
 
కాగా, ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ 'ఆచార్య' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన కాసేపు తళుక్కుమనే పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments