Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహేష్, చిరు' వరదసాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50లక్షలు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (18:58 IST)
ఏపీలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరదల కారణంగా భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది. అకాల వ‌ర్షాల‌తో రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప‌, చిత్తూరు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌తో పాటు నెల్లూరు జిల్లాలోనూ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. 
 
దాదాపు ఆరువేల కోట్లకు పైగానే వ‌ర‌ద న‌ష్టం సంభ‌వించింద‌ని ప్రభుత్వం అంచ‌నా వేసింది. ఈ నేపథ్యంలో త‌క్ష‌ణ సాయంగా కేంద్ర ప్ర‌భుత్వం కొంత సాయాన్ని అందించాలని వై.ఎస్‌.జ‌గ‌న్ సర్కారు విజ్ఞప్తి చేసింది. 
 
ఇలాంటి తరుణంలో టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మ‌హేశ్ బాబు వ‌ర‌ద బాధితుల కోసం త‌లా రూ.25 ల‌క్ష‌లు విరాళాన్ని అందిస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర‌ద‌ల విప‌త్తు బాధిత కుటుంబాల‌కు నావంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 25 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టిస్తున్నాను.. అని చిరంజీవి తెలిపారు. 
Megastar Chiranjeevi
 
ఆంధ్రప్రదేశ్ వినాశకరమైన వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. వారి కోసం నా వంతుగా రూ.25 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇది సంక్షోభ స‌మ‌యం ఒక‌రికొకరు అండ‌గా నిల‌బ‌డాల్సిన త‌రుణం. అంద‌రూ ముందుకు వ‌చ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సాయం చేయండి అని అని మ‌హేశ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments