Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివ శంకర్ మాస్టర్ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు రూ.3 ల‌క్ష‌లు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

శివ శంకర్ మాస్టర్ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు రూ.3 ల‌క్ష‌లు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (19:15 IST)
శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల సాయం  అందించారు. ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ‌గా, ఆయ‌న‌కు ఎక్క‌డో ఉన్న బాలీవుడ్ న‌టుడు సంఘీభావం తెలిపారు. కానీ, ఇక్క‌డున్న తెలుగు న‌టులు మాత్రం కేవలం ట్వీట్ ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో మెగాస్టార్ ముంద‌డుగు వేశారు. 

 
కరోనా బారిన పడి గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స  పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్ద కుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా, సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో మాస్టర్‌ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్, ధనుష్‌ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కానీ, ఇక్క‌డ మాత్రం తెలుగు హీరోల‌లో ఎలాంటి స్పంద‌నా లేదు. మంచు విష్ణు మా అధ్య‌క్షుడైనా, కేవ‌లం ట్వట్ ల‌తో, ఫోన్ కాల్ తో కాల‌క్షేపం చేస్తున్నారు.


కానీ, ఆపద అంటూ వస్తే, నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్  చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. శివ‌శంక‌ర్ కుటుంబానికి 3 ల‌క్ష‌ల చెక్కు అందించ‌డంతో వారు చిరంజీవికి కృత‌జ్న‌త‌లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?