Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను ఒకేవేదికపై తేనున్న ప్రపంచ తెలుగు సమాఖ్య

డీవీ
శనివారం, 26 అక్టోబరు 2024 (10:15 IST)
Dr. VL Indiradat, Sai, Harish Chandra Prasad
1993లో స్థాపించబడిన 'ప్రపంచ తెలుగు సమాఖ్య' దాదాపు ముప్పయి (30) సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అందులో భాగంగా తెలుగునాట అనేక కార్యక్రమాలతో పాటు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి 'అంతర్జాతీయ తెలుగు మహాసభలు' నిర్వహిస్తూ వస్తోంది. ఇంతవరకు వివిధ రాష్ట్రాలలో, విదేశాలలో పదకొండు ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూరు, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాలలో, మరల 2018లో చెన్నైలో జరిగాయి.
 
ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య 'పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుపుతోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగే ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గౌరవ అతిథులుగా ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మరియు కేంద్రమంత్రులు మరికొందరు వివిధ రంగాల తెలుగు ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది.
 
ఈ మహాసభల్లో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను సత్కరించడం జరుగుతుంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరుగుతాయి. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయి.
 
ఈ మూడు రోజుల అంతర్జాతీయ మహాసభలకు హాజరు కావాలనుకునే తెలుగు భాషాభిమానులు, కళాభిమానులు ముందుగా తమ తమ పేర్లను ప్రతినిధులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ తెలుగు సమాఖ్య 'వెబ్సైట్'లో ఉంచబడిన ప్రతినిధుల నమోదీకరణ పత్రం (డెలిగేట్ రిజిస్ట్రేషన్ ఫారం) ద్వారా కూడా 'ఆన్లైన్లో' రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, వారిలో సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం, భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నది ప్రపంచ తెలుగు సమాఖ్య. ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య 'పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుపుతున్నాం. ఈ మహాసభల్లో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను సత్కరించడం జరుగుతుంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరుగుతాయి. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరియు దేశవిదేశాల నుండి సుమారు రెండువేలమంది ప్రతినిధులు ఈ 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలకు హాజరు కాగలరని ఆశిస్తున్నాము' అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayamma’s 69th Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments