Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ ఎన్‌కౌంటర్: రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన సెన్సార్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (21:37 IST)
Disha Encounter
ఎప్పుడూ వివాదాస్పద సినిమాలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు. దీనిపై 'దిశ ఎన్‌కౌంటర్ ' పేరుతో సినిమాను రూపొందించనున్నట్లు ఆర్జీవీ తెలియజేశారు. 
 
అన్నట్లుగానే రామ్‌గోపాల్ వర్మ దిశ ఎన్‌కౌంటర్ సినిమాను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్స్‌, ట్రైలర్‌ను విడుదల చేసి ఈ నెల 19న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సినిమాపై దిశ కుటుంబ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
దిశ ఎన్‌కౌంటర్ సినిమాను వీక్షించిన నలుగురు సభ్యులున్న సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సినిమా ఇప్పుడు రివైజింగ్ కమిటీ చూడనుంది. దీన్ని ఎనిమిది మంది సభ్యులున్న రివైజింగ్ కమిటీ చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 
 
ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌, సోనియా, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19న సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావించిన తరుణంలో సెన్సార్ సభ్యుల నుంచి అవాతరం ఏర్పడింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దిశ ఘటనపై దేశం యావత్తు విస్తుపోయింది. పోలీసులు నేరస్థులను పట్టుకుని ఎన్‌కౌంటర్ కూడా చేశారు.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments