భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (18:47 IST)
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై గృహహింస, క్రూరత్వం, మోసం కేసులను బనాయించారు. ఈ మేరకు తన భర్త పీటర్ హాగ్‌పై ఆమె ముంబై మహానగరంలోని ఓ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. దీన్ని పరిశీలించిన తర్వాత పీటర్ హాగ్‌ను కోర్టు నోటీసులు జారీచేయనుంది. 
 
ఆస్ట్రియాలో పీటర్‌ ఆధీనంలో ఉన్న తన పిల్లలను కలిసేందుకు కూడా అతడు అవకాశం ఇవ్వడం లేదని సెలీనా పిటీషన్‌లో పేర్కొన్నారు. వారితో వర్చువల్‌గా మాట్లాడే అవకాశం అయినా కల్పించాలని కోరారు. పీటర్‌ నుంచి నెలకు రూ.10 లక్షల భరణంతో పాటు రూ.50 కోట్లు పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. దీనిపై డిసెంబరు 12వ తేదీ తర్వాత విచారణ జరగనుంది.
 
కాగా, గత 2011లో సెలీనా జైట్లీ, పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కొన్నేళ్ల తర్వాత ఈ జంటకు మరోసారి కవలలు పుట్టారు. అయితే, అనారోగ్య కారణాలతో వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments