Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి పేరు ప్రస్తావించకపోవడం విచారకరం : నిర్మాత సి.కళ్యాణ్

Webdunia
బుధవారం, 4 మే 2022 (11:23 IST)
మే ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన మే డే ఉత్సవాల్లో దివంగత దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణ రావు పేరును ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం విచారకరమని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సినీ కార్మికోత్సవం జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. 
 
దీనిపై సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దివంగత దాసరి నారాయణ రావు గురించి కనీసం మాటమాత్రం కూడా ప్రస్తావించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. దాసరి నారాయణ రావు లేకుండా సినీ కార్మికులు లేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. సినీ కార్మికులు దాసరి, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డిలను విస్మరించడం సరికాదన్నారు. 
 
మరోవైపు, నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ వివరణ ఇచ్చారు. సినీ కార్మికోత్సవంలో దాసరి నారాయణ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దండ వేయడం మరిచిపోయామన్నారు. తాము చేసింది తప్పేనని ఆయన అంగీకరించారు. ఇకపై తాము ఏ కార్యక్రమం చేపట్టినా దాసరికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments