Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొడ్యూసర్ గిల్డ్ మాఫియా వల్ల సినిమా పరిశ్రమ నాశనం: సి.కళ్యాణ్ సెన్సషనల్ కామెంట్

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (13:23 IST)
C.Kalyan'
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటినుంచో నిర్మాతల మండలి ఉంది. కానీ ఆ తర్వాతా అంటే కరోనాకు ముందు రెండుగా విడిపోయింది. ప్రొడ్యూసర్ గిల్డ్ అని కొద్దిమంది నిర్మాతలు పెట్టుకుని సినిమాలను ప్రమోషన్ చేసుకుంటున్నారు.  దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.  అయితే రెగ్యులర్ ప్రొడ్యూసర్ కలిపి ఇలా పెట్టుకున్నామని తెలిపారు. నిర్మాతల మండలి ఏమి చేస్తుందని కామెంట్స్ కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా రేపు ఆదివారం నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ మీడియా సమావేశంలో పలు విషయాలు తెలిపారు. 
 
- 2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి.  నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్, నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. కానీ అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు. 
 
- దిల్  రాజు, సి.కళ్యాణ్ ఫ్యానెల్ వేరు వేరు కాదు. నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారు. దిల్ రాజుతో నన్ను పోలుస్తూ దుప్ప్రచారం చేస్తున్నారు. నేను 80 చిన్న సినిమాలు తీశాను, ఎవరిని మోసం చేయలేదు. అవార్డుల కోసం డోనర్ల దగ్గర అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ఇక గతంలో సినిమా షూటింగ్స్ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు
 
నిర్మాతల మండలిలో ఇప్పుడు దామోదర ప్రసాద్ నాలుగేళ్లు కార్యదర్శిగా ఉన్నారు. చేసింది ఏమి లేదు.  చిన్న నిర్మాతలకు నిర్మాతల మండలిలో అన్యాయం జరుగుతోంది. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. నిర్మాతల మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. గిల్డ్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. అసలు గిల్డ్ లో 27 మంది సభ్యులున్నారు.  నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలే ఎక్కువ నిర్మాతల మండలి పరిష్కరించింది. అందుకే ఓటర్లు మీరే ఆలోచించి కొత్త బాడీని ఎన్నుకొండి అని కళ్యాణ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments