Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి చీరలు వేలం.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:23 IST)
వెండితెర అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి ఈలోకం విడిచిపోయింది. కానీ, ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా చెదిరిపోలేదు. ముఖ్యంగా, శ్రీదేవి మరణించారన్న వార్తను ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె ధరించిన కోటా చీరను వేలం వేయాలని ఆమె భర్త బోనీకపూర్ నిర్ణయించారు. ఆ వేలం ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యాలకు వినియోగించాలనేది ఆయన ఆశయం. 
 
ఈ చీరలను ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. వేలం ఆదాయాన్ని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిస్సహాయులు, వృద్ధుల కోసం, విద్యాభివృద్ధికి పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా, అబుదాబీలో సమీపబంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు నీటి తొట్టిలో పడి చనిపోయిన విషయం తెల్సిందే. ఆమె చితాభస్మాన్ని కుటుంబసభ్యులు తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలో నిమజ్జనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments