Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి చీరలు వేలం.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:23 IST)
వెండితెర అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి ఈలోకం విడిచిపోయింది. కానీ, ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా చెదిరిపోలేదు. ముఖ్యంగా, శ్రీదేవి మరణించారన్న వార్తను ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె ధరించిన కోటా చీరను వేలం వేయాలని ఆమె భర్త బోనీకపూర్ నిర్ణయించారు. ఆ వేలం ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యాలకు వినియోగించాలనేది ఆయన ఆశయం. 
 
ఈ చీరలను ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. వేలం ఆదాయాన్ని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిస్సహాయులు, వృద్ధుల కోసం, విద్యాభివృద్ధికి పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా, అబుదాబీలో సమీపబంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు నీటి తొట్టిలో పడి చనిపోయిన విషయం తెల్సిందే. ఆమె చితాభస్మాన్ని కుటుంబసభ్యులు తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలో నిమజ్జనం చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments