Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవితో శిల్పాశెట్టి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

అతిలోక సుంద‌రి అంటే అభిమానం లేనిది ఎవ‌రికి. అంద‌రికీ శ్రీదేవి అంటే అభిమాన‌మే. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఇలా ఎంతోమంది సినీ ప్ర‌ముఖుల అభిమానం సొంతం చేసుకుంది. ఆమె అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో... ఆమెతో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుం

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (19:10 IST)
అతిలోక సుంద‌రి అంటే అభిమానం లేనిది ఎవ‌రికి. అంద‌రికీ శ్రీదేవి అంటే అభిమాన‌మే. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఇలా ఎంతోమంది సినీ ప్ర‌ముఖుల అభిమానం సొంతం చేసుకుంది. ఆమె అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో... ఆమెతో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పంచుకున్న క్షణాలను వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

నిర్మాత కరణ్ జోహార్... శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు. అప్పుడు చిత్రీక‌రించిన‌ వీడియోను శిల్పాశెట్టి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అమ్మ లాంటి శ్రీదేవితో కలిసి ఉన్నామని ఈ వీడియోలో వారంతా చెప్పారు. శ్రీదేవి నటించిన మామ్ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోందని, ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు కోరారు. 
 
ఈ సంతోషకరమైన ఆదివారం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమతో ఇదేవిధంగా గుర్తు పెట్టుకుంటాను. శ్రీదేవిని ప్రేమించే వారి కోసం ఈ వీడియో అని శిల్పాశెట్టి తన సందేశంలో పేర్కొంది. మీరు కూడా ఈ వీడియో చూడాల‌నుకుంటున్నారా.. అయితే శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ని ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments