Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవి మరణంపై మీడియా సర్కస్ చూస్తే కోపం వస్తోంది: ప్రీతి జింటా

సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైప

Advertiesment
Sridevi funeral
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:57 IST)
సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైపుణ్యతకు, నటనకు నిలయమైన సినీతార శ్రీదేవిపై దిగజారుడు కథనాలు ప్రచురించేందుకు మీడియాకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ ప్రీతి జింటా ప్రశ్నించింది. 
 
అలాగే ప్రీతి జింటా శ్రీదేవి పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడించింది. శ్రీదేవిని కడసారి చూసేందుకు రాలేకపోయానని బాధపడింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను రాలేకపోతున్నందుకు కారణం కూడా చెప్పింది. శ్రీదేవికి అంతిమ వీడ్కోలుకు అందరూ ముంబైకి వెళ్లేవుంటారు. కానీ ఈ భూగోళానికి మరోవైపున తానున్నట్లు ప్రీతి జింటా తెలిపింది.
 
తన చిన్ననాటి జీవితంలో భాగమైన... మై ఐకాన్ శ్రీదేవి వెళ్లిపోతోంది. హవాహవాయి తనను చూసి చిరునవ్వులు చిందిస్తోందంటూ పోస్టు చేసింది. ఆమె ఎప్పటికీ తన మనసులో వుంటుందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని.. ఆమెకు గుడ్ బై చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నానని ప్రీతి జింటా పోస్టు పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?