బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు ఆదివారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"వాడొచ్చేశాడు.. మా అబ్బాయి.. అతను లేని జీవితాన్ని ఇపుడు ఊహించుకోలేకపోతున్నాం. మా చేతులు నిండాయి. మా హృదయాలు మరింతగా నిండాయి. మొదట మేమిద్దరం ఉన్నాం. ఇపుడు మాకు సర్వస్వం లభించింది" అంటూ భావోద్వేగంతో కూడిన నోట్ను రాసుకొచ్చారు. ఈ వార్త తెలియగానే అభిమానులు, పలువురు సినీ, రాజకీయ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పరిణీతి చోప్రా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, గత 2023లో రాఘవ్ - పరిణీతి చోప్రా వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ గ్లామర్, రాజకీయ వైభవం, కలగలిసిన ఈ పెళ్లి అప్పట్లో దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది., లండన్లో చదువుకునే రోజుల్లో మొదలైన వీరి స్నేహం, కొన్నేళ్ల తర్వాత ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.