Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (19:03 IST)
లౌక్య ఎంటర్‌టైన్మెంట్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం "దండోరా". ఈ చిత్రంలో బిందు మాధవి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనున్నారు. ఎమోషనల్ టచ్‌తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుందని మేకర్స్ అంటున్నారు. 
 
ఫస్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న 'దండోరా' సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్గాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతాయన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం అని దర్శకుడు మురళీకాంత్ అంటున్నారు. 
 
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు ప్రహరీ గోడపై చిరుతపులి పరుగులు (video)

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. సీఎం రేవంత్ రాజకీయ క్రీడలో భాగమంటున్న కవిత

వైఎస్ఆర్ కడప జిల్లా బాగానే వుంది, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అయితే బహుబాగు: వైఎస్ షర్మిల

Roja: చంద్రబాబు అధికారంలోకి వచ్చింది అప్పులు, అరచకాలకు పెంచడానికే: రోజా

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

తర్వాతి కథనం
Show comments