Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్-5 ఫైనల్ : ఆ ముగ్గురు ఔట్.. రేసులో ఇద్దరు!

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (21:46 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం రాత్రి జరిగింది. ఇందులో తొలుత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సిరి. ఫైనల్ వారానికి ఐదుగురు అర్హత సాధించగా, వారిలో సిరి ఒకరు. అయితే, హౌస్‌లోకి వెళ్లిన హీరోయిన్ రష్మిక మందన్నా.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆమెను స్టేజీపైకి తీసుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ, బిగ్ బాగ్ ఇంట్లో తన ప్రస్థానం అద్భుతంగా సాగిందన్నారు. తాను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నానని తెలిపింది. సిరి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో మానస, సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముక్ ముగిలిపారు. ఆ తర్వాత మానస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత కంటెస్టెంట్లకు డబ్బు ఆఫర్ చేసేందుకు 'శ్యామ్ సింగారాయ్' టీమ్ నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయిపల్లవి, కృతిశెట్టిలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. కానీ డబ్బు కోసం హౌస్‌లో మిగిలిన నలుగురు ఏమాత్రం ఆసక్తి చూచడం లేదు. దీంతో చివరగా నలుగురు బొమ్మలు వేలాడదీశారు. 
 
లీవర్ లాగినపుడు ఎవరి బొమ్మ కిందపడిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ముందుగానే ప్రకటించారు. ఇందులో మానస్ బొమ్మ కిందపడిపోవడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్‌లో మిగిలింది శ్రీరామ్, షణ్ముఖ్, వీజే సన్నీలు ఉన్నారు. వీరిలో శ్రీరామ్ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో సన్నీ, షణ్ముఖ్ మాత్రమే మిగిలివున్నారు. వీరిలో ఒకరు విజేతగా ఎంపికకానున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments