Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "భోళాశంకర్‌"కు వీడిన చిక్కులు - యధావిధిగానే రిలీజ్

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (21:52 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "భోళాశంకర్" చిత్రానికి కోర్టు చిక్కులు వీడాయి. దీంతో ఆగస్టు 11వ తేదీన యధావిధిగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. గాయత్రి ఫిలిమ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో "భోళాశంకర్" విడుదలపై ఉన్న సందిగ్ధత వీడిపోయింది. 
 
"భోళాశంకర్" చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టుకు ఆశ్రయించారు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర తనను రూ.30 కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపించారు. "ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో ఐదేళ్లపాటు తమ గాయత్రీ ఫిలిమ్స్‌కు ఇస్తానని గతంలో చెప్పారని, ఈ మేరకు అగ్రిమెంట్ రాసిచ్చారని ఇందుకు తాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
కానీ, తనకు వైజాగా జిల్లా మాత్రమే హక్కులు ఇచ్చారని, తదనంతర పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందే తన డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి, మాట తప్పారని, అందువల్ల చిత్ర విడుదలను నిలిపుదల చేయాలని కోరారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం యధావిధిగా విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments