Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతి - 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఈ మృతికి సంతాపసూచకంగా 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను రద్దు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో సోమవారం రాత్రి ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా, రాత్రి 8 గంటలకు ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి సంతాపసూచకంగా ఈ ప్రిరిలీజ్ వేడుకను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్ అధినేత నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
కాగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లతో పాటు విలన్ పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments