Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంటల్‌ యాంగ్జైటీతో కరోనా మరణాలు : భాగ్యశ్రీ

Webdunia
గురువారం, 27 మే 2021 (10:49 IST)
దేశంలో కరోనా వైరస్ రోగుల మృతులపై బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చాలా మంది కరోనా భయం, మెంటల్ యాంగ్జైటీతో ప్రాణాలు కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కరోనా రోగులు త్వరగా కోలుకోవాలంటే ధైర్యమే సగం బలం అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. 
 
ఇందులో ఆమె ఏం మాట్లాడారంటే.. 'కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడంతో ప్రజల పరిస్థితి మరింత కష్టంగా మారింది. తెలియని దానికోసం భయపడడం, టెన్షన్‌ తెచ్చుకోవడం వల్ల లోలోపలే మనం నలిగిపోతున్నాం. అదే మరణానికి దారి తీస్తుంది. నా తండ్రికి కరోనా సోకిన సమయంలో భయపడుతూ ఏం జరిగిపోతుందో అన్న యాంగ్జైటీ సమస్యతో ఐసీయూలో చేరారు. 
 
22 రోజుల తర్వాత మరణించారు. నాతో ఉండే కజిన్స్‌ కూడా ఇలాంటి సమస్యతోనే భయపడేవారు. వారందరికీ పాజిటివ్‌గా ఉండమని చెప్పా. మనం ఆరోగ్యంగా, భయం లేకుండా ఉండాలంటే కరోనాకు సంబంధించిన న్యూస్‌ చూడడం మానేయాలి. 
 
ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపండి. ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు సన్నిహితులతో వీడియో కాల్‌లో కనెక్ట్‌ అవ్వండి. హెల్తీఫుడ్‌ తీసుకోండి. వ్యాయామాలు చేయండి. ప్రశాంతంగా పడుకోండి. దాని వల్ల మనలో ఇమ్యూనిటీ స్టాండ్‌ పెరుగుతుంది. యాంగ్జైటీ డిసీజ్‌ ఉన్నవాళ్లు డాక్టర్‌ని కలవండి. మెంటల్‌ హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ సజెషన్స్‌ తీసుకోండి'  అంటూ ఆమె హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments