పవన్ కళ్యాణ్ నా దేవుడు.. నా రక్తం కాంగ్రెస్ : బండ్ల గణేష్

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (20:03 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ తనకు దేవుడని సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోమారు స్పష్టం చేశారు. అయితే, తన శరీరంలో మాత్రం కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుందని, అందువల్ల తాను పక్కా కాంగ్రెస్ అభిమానని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రీరిలీజ్‌ను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో బండ్ల గణేష్ మాట్లాడుతూ, తాను పక్కా కాంగ్రెస్ వాదినని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తనకు ఎనలేని అభిమానమన్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన కోరిక అన్నారు. 
 
అక్రమ నిర్మాణాలపై హైడ్రా చేపట్టిన చర్యలు మంచివేనన్నారు. ఇందులో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారన్నారు. ఇపుడు తన ఇంటికి ఇచ్చినా నోటీసులు తీసుకుంటానని తెలిపారు. బఫర్ జోన్ లేదా ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉంటే కూల్చివేసుకోవచ్చన్నారు. ఇకపోతే, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరబోనని తెలిపారు. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీ అభిమానని చెప్పారు. పవన్ తనకు భగవంతుడితో సమానమన్నారు. "గబ్బర్ సింగ్" సినిమా తర్వాత తన జీవితం దశ దిశ తిరిగిపోయిందన్నారు. ఈ జన్మకు పవన్‌కు వీరభక్తుడినని తెలిపారు. 
 
ఇకపోతే, గతంలో ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్‌లో ఉండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నోరు జారానని చెప్పారు. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని తెలిపారు. ఆయనకు ఇపుడు మీ ద్వారా క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. 'తీన్‌మార్' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్మానని, కానీ, చిన్నచిన్న సమస్యల వల్ల అది మిస్‌‍ఫైర్ అయిందన్నారు. ఈ చిత్రాన్ని మళ్లీ అద్భుతంగా చేసి రీ రిలీజ్ చేసి హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments