Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - మహేశ్‌ల వల్ల రూ.100 కోట్లు నష్టపోయా - నిర్మాత సింగమనల :: కౌంటరిచ్చిన బండ్ల (Video)

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (16:31 IST)
తెలుగు చిత్ర నిర్మాత సింగలమల రమేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుల వల్ల తాను రూ.100 కోట్ల మేరకు నష్టపోయినట్టు వెల్లడించారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఆ ఇద్దరు హీరోలు కనీసం మాట మాత్రం కూడా పలుకరించలేదని వాపోయారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, 'ఖలేజా', 'కొమరం పులి' సినిమాల వల్ల రూ.100 కోట్లు నష్టపోయినట్టు చెప్పారు. భారీగా నష్టపోయాక కూడా ఎవరూ తనకు సపోర్టు చేయలేదన్నారు. 'కొమరం పులి' సినిమా తీసే సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో తిరిగారని,  అలా సినిమా కొంచెం డిస్టర్బ్ అయిందని, ఇప్పటివరకు నన్ను ఎలా ఉన్నావు? నీ సమస్య ఏంటి అని ఎవరూ అడిగిన పాపాన పోలేదని వాపోయారు. 24 క్రాఫ్ట్స్‌పై గ్రిప్ ఉంటేనే సినిమా తీయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవడం బెట్టర్ అంటూ కామెంట్స్ చేశారు. 
 
అయితే, నిర్మాత సింగమనల రమేశ్‌కు మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమాను రమేష్ బాబు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని, తప్పు మీరు చేసి పవన్ కళ్యాణ్‌ని అనడం కరెక్ట్ కాదని, మూడేళ్ల పాటు పవన్ కళ్యాణ్ తన సమయాన్ని వృధా చేసుకున్నారనీ, పవన్ కళ్యాణ్ వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారని, దీనికి ప్రత్యక్ష సాక్షి తానేనని బండ్ల గణేశ్ వెల్లడించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments