Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతే కాదు.. దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది : బాలకృష్ణ

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో హీరో పాత్రను ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తుంటే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (11:56 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో హీరో పాత్రను ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తుంటే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ సొంతూరు అయిన నిమ్మకూరుకు శనివారం వెళ్లింది. చిత్రం షూటింగ్‌లో భాగంగా, నిమ్మకూరులో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. అందుకే నిమ్మకూరు పరిసరాలు, ఎన్టీఆర్ బంధువుల గురించి తెలుసుకునేందుకు చిత్ర యూనిట్ అక్కడ పర్యటించింది.
 
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఎవరైతే వాళ్లు పుట్టిన కుటుంబానికి ఊరికి, జాతికి, దేశానికి ఖ్యాతిని తీసుకొస్తారో వాళ్లే మహానుభావులు అనిపించుకోవడానికి అర్హులు. వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఒక తండ్రి పాత్రలో కొడుకు నటించడమనేది చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం. కొడుకే తండ్రి జీవిత చరిత్రను నిర్మించడం. నిర్మాతగా నా మొదటి సినిమా కావడం.. నా బ్యానర్‌లో తీయడం.. ఒక కాకతాళీయమన్నారు. 
 
ఇకపోతే, ఈ చిత్రం షెడ్యూల్‌లో భాగమే నిమ్మకూరు రావడం జరిగిందన్నారు. క్రిష్‌కి నిమ్మకూరులోని మా బంధువులందరినీ పరిచయం చేశాను. తెలుగు జాతే కాదు.. దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది. నిమ్మకూరు అక్టోబర్ చివరిలో కానీ.. నవంబర్‌లో కానీ షూటింగ్ ఉంటుందని బాలయ్య వివరించారు. 
 
అంతేకాకుండా, 'నిమ్మకూరు అనేది ఆయన పుట్టిన ఊరు. వ్యక్తిగతంగా ఆయన సినిమా చేయడానికి కారణాలు.. ఒకటేమో ఒక నటుడిగా నాపై ఉన్న ప్రభావం.. రెండవది తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం. ఎన్టీఆర్ ఎన్నో పథకాలకు ఆయన నాంది పలికాడు. దేశం మొత్తం కూడా ఆ పథకాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి అలాంటి మహనీయుడి కథను భావితరాలకు అందజేయాలని నాకు అనిపించింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments