Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ ఆదిత్య 369కు మూడు దశాబ్దాలు

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (10:12 IST)
యువరత్న బాలకృష్ణ, మోహిని, సిల్క్ స్మిత కాంబినేషన్‌లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం విడుదలై 30 సంవత్సరాలు దాటింది. టైమ్ మెషీన్ కాన్సెప్టుతో పూర్తిగా ఫిక్షన్ మూవీగా 'ఆదిత్య 369' వచ్చింది. ఈ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఓ విలక్షణ చిత్రంగా నిలిచిపోయింది. 
 
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ స్పందిస్తూ, 30 యేళ్ల క్రితం తాను నటించిన చిత్రం విడుదలై 30 ఏళ్లు దాటినా ఇంకా ప్రజాదరణ పొందుతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య 369 సినిమా డిజిటల్ మీడియాలో ఈ తరాన్ని కూడా ఆకర్షిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 
 
ప్రపంచ సినీ చరిత్రలో సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, చరిత్ర... ఈ మూడు జోనర్లను మేళవించి తెరకెక్కించిన అతి తక్కువ చిత్రాల్లో మనదేశం నుంచి బహుశా ఇదొక్కటేనేమో అని అభిప్రాయపడ్డారు.
 
'ఇంతటి చిరస్మరణీయ దృశ్య కావ్యానికి నన్ను కథానాయకుడ్ని చేసిన దర్శకశాస్త్రవేత సింగీతం శ్రీనివాసరావు గారికి, నిర్మాతలు స్వర్గీయ ఎస్పీ బాలు, కృష్ణప్రసాద్‌కి, నా ఊపిరితో సమానమైన అభిమానులకు, తరం మారినా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సదా కృతజ్ఞుడ్ని' అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments