మళ్లీ కలుసుకోనున్న బాలకృష్ణ - విజయసాయి రెడ్డి... ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (14:33 IST)
రాజకీయాల్లో బద్ధ విరోధులుగా ఉన్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిలు మళ్లీ కలుసుకోనున్నారు. అయితే, వీరిద్దరూ మళ్లీ కలుసుకోనుండటానికి ఓ కారణం ఉంది. ఇటీవల మరణించిన సినీ నటుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మ వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ కల్చరల్ సెంటరులో జరుగనుంది. 
 
మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్‌గా బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లను వేశారు. 
 
తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసేంత వరకు బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. విజయసాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు అనే సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పెద్దరికాన్ని ప్రదర్శించారు. 
 
చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబసభ్యులతో ఒక బంధువులా కలిసి పోయారు. విజయసాయి వ్యవహరించిన తీరును చాలా మంది హర్షించారు. ఇప్పుడు మరోసారి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా బాలయ్య, విజయసాయి కలవబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments