మళ్లీ కలుసుకోనున్న బాలకృష్ణ - విజయసాయి రెడ్డి... ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (14:33 IST)
రాజకీయాల్లో బద్ధ విరోధులుగా ఉన్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిలు మళ్లీ కలుసుకోనున్నారు. అయితే, వీరిద్దరూ మళ్లీ కలుసుకోనుండటానికి ఓ కారణం ఉంది. ఇటీవల మరణించిన సినీ నటుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మ వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ కల్చరల్ సెంటరులో జరుగనుంది. 
 
మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్‌గా బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లను వేశారు. 
 
తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసేంత వరకు బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. విజయసాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు అనే సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పెద్దరికాన్ని ప్రదర్శించారు. 
 
చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబసభ్యులతో ఒక బంధువులా కలిసి పోయారు. విజయసాయి వ్యవహరించిన తీరును చాలా మంది హర్షించారు. ఇప్పుడు మరోసారి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా బాలయ్య, విజయసాయి కలవబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి ఎక్కువ.. తెలంగాణకు తక్కువ.. రేవంతన్న ఎన్ని తంటాలు పడినా?

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments