Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన అవతార్.. భారత్‌లో తొలి హాలీవుడ్ చిత్రం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (18:39 IST)
జైమ్స్ కామెరూన్ రూపొందించిన చిత్రం అవతార్ : ది వే ఆఫ్ వాటర్ చిత్రం భారత్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా భారత్‌లో టాప్ 10లో ఉండగా, గత 2022 సంవత్సరంలో తొలిస్థానంలో నిలిచింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇప్పటివరకు రూ.454 కోట్లు వసూలు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. అన్ని భారతీయ భాషల్లో కలిపి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.14,060 కోట్లను రాబట్టింది. అయితే, ఈ హవా సంక్రాంతి 14వ తేదీ తర్వాత తగ్గిపోనుంది. సంక్రాంతికి అనేక కొత్త చిత్రాలు దేశ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. 
 
దీంతో అవతార్ ప్రదర్శించే థియేటర్ల సంఖ్యతో పాటు కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉంది. గతంలో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం భారత్‌లో రూ.438 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ రికార్డును అవతార్ బద్ధలుకొట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హాలీవుడ్ చిత్రం నిలిచింది. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments